Wednesday, April 24, 2024

ఇది కేవ‌లం ఉంగ‌రం మాత్ర‌మే కాదు-నా ఆరోగ్య‌ప‌రిస్థితిని తెలియ‌జేసే మిష‌న్ – చంద్ర‌బాబునాయుడు

అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌రిగిన టీడీపీ మినీ మ‌హానాడుకు హాజ‌ర‌య్యారు టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు. ఎంతో సాదా సీదాగా క‌నిపించే చంద్ర‌బాబు వేలికి ఓ ప్లాటినం రింగ్ క‌న‌ప‌డింది. దాంతో అస‌లు విష‌యం ఏంటా అని ఆరా తీశారు పార్టీ నేత‌లు.దాంతో చంద్ర‌బాబు ఆ ఉంగ‌రం ప్ర‌త్యేక‌త‌ల‌ను వివ‌రించారు. త‌న వేలికి ప్లాటినం ఉంగ‌రం కొత్త‌గా చేరిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. అది కేవ‌లం ఉంగ‌రం మాత్ర‌మే కాద‌ని, అది త‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేసే ప‌రిక‌ర‌మ‌ని చెప్పారు.

ప్లాటినం ఉంగ‌రంలో ఓ చిప్ ఉంద‌ని… అది త‌న హార్ట్ బీట్‌, స్లీపింగ్ అవ‌ర్స్‌, ఆహారం.. త‌దిత‌ర అంశాల‌న్నింటినీ రికార్డు చేస్తుంద‌ని చెప్పారు. ఆ వివ‌రాల‌ను ప్లాటినం ఉంగ‌రం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కంప్యూట‌ర్‌కు పంపుతుంద‌ని కూడా చంద్ర‌బాబు తెలిపారు. రోజూ నిద్ర లేచిన వెంట‌నే కంప్యూట‌ర్‌లో ప్లాటినం ఉంగ‌రం పంపిన రిపోర్ట్ చెక్ చేసుకుంటాన‌ని, రోజువారీగా జ‌ర‌గాల్సిన చ‌ర్య‌ల్లో ఏది త‌ప్పుగా ఉంద‌న్న విష‌యాన్ని అది ఇట్టే చెప్పేస్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఆ నివేదిక‌ను చెక్ చేసుకుని నిన్న ఏం త‌ప్పు చేశామ‌న్న విష‌యాన్ని గుర్తించి… అది మ‌ర‌లా పున‌రావృతం కాకుండా చూసుకుంటూ త‌న ఆరోగ్యాన్నికాపాడుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement