Friday, April 19, 2024

సిటీ స్కాన్ చేయించేవారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

కరోనా నిర్ధారణ కోసం ప్రతిసారి సిటీ స్కాన్ తీయించవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ‘ఒకసారి సిటీ స్కాన్ తీయించడం 300-400 సార్లు ఎక్స్‌రేలు తీయించడంతో సమానం. స్వల్ప లక్షణాలు ఉంటే సిటీ స్కాన్ తీయించకండి. చిన్న వయసులో అత్యధిక సార్లు సిటీ స్కాన్ తీయిస్తే.. భవిష్యత్‌లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది’ అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

కాగా సిటీ స్కాన్ ఎక్కువగా చేసుకుంటే రేడియేషన్ వల్ల కాన్సర్ రావచ్చని ఎయిమ్స్ డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. చెస్ట్ ఎక్స్‌రే తీసుకున్న తరువాత ఇబ్బందిగా ఉంటేనే సిటీ స్కాన్ చేసుకోవాలని తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చి తక్కువ లక్షణాలు ఉన్నావారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండి దాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారంతా సిటీ స్కాన్ తీయించుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

పైగా సిటీస్కాన్ ఎక్కువ ఖర్చుతో కూడకున్న వ్యవహారం అని ఆయన అన్నారు. అలాగే వైద్యుల సూచనల మేరకే రోగులు మందులు వాడాలని, మధ్యస్ధ లక్షణాలు ఉన్నవారు అనవసరంగా మందులు తీసుకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. కరోనా కట్టడికి సంబంధించి ఏరకంగా మందులు వాడాలి, ఎప్పడు ఆస్పత్రికి వెళ్లాలనేది వెబినార్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నామని గులేరియా అన్నారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు మాని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని, అవసరమైన వారికి బెడ్లు, ఆక్సిజన్ అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement