Friday, April 26, 2024

కేంద్రం ఆధ్వ‌ర్యంలో ఆల్ పార్టీ మీట్..మోడీ హాజ‌ర‌య్యేనా..

ఈ నెల 29నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ స‌మావేశాల‌కి ఒక రోజు ముందు అంటే న‌వంబ‌ర్ 28న కేంద్రం ఆధ్వ‌ర్యంలో ఆల్ పార్టీ మీట్ ని ఏర్పాటు చేయ‌నున్నారు. కాగా ఈ మీటింగ్ కి ప్ర‌ధాని మోడీ కూడా హాజ‌రుకానున్నార‌ని స‌మాచారం. మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆల్ పార్టీ మీట్ లో కూడా మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ సెషన్‌లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు- 2019 కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఆమోదించింది. వ్యక్తిగత డేటాకు సంబంధించిన వ్యక్తుల గోప్యతకు రక్షణ కల్పించడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది. మరో వైపు టీఆర్ఎస్ పార్టీ ధాన్యం కొనుగోలు అంశాన్ని, టీఎంసీ బీఎస్ఎఫ్ పరిధి పెంపు అంశంపై, కాంగ్రెస్ రైతు చట్టాల రద్దుతో , నూతన విద్యుత్ బిల్లులు, ఎంఎస్ పీ బిల్లుల కోసం, సీఏఏ ఎన్ ఆర్ సీ బిల్లులపై పార్లమెంట్లో పట్టుబట్టే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement