Thursday, April 25, 2024

గ‌డిచిన 24గంటల్లో కొత్త‌గా -1,247కేసులు

గ‌డిచిన 24గంట‌ల్లో కొత్త‌గా 1,247కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో నిన్న భారీ పెరిగిన కేసులు.. నేడు తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయని కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొంది. మరణాలు సైతం భారీగా తగ్గాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. తాజాగా 928 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,30,45,527కు పెరిగింది. ఇందులో 4,25,11,701 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 5,21,966 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.03శాతం ఉన్నాయని, ప్రస్తుతం రికవరీ రేటు 98.76శాతానికి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement