Tuesday, April 23, 2024

దేశంలో కొత్త క‌రోనా కేసులు..హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన కేంద్ర ఆరోగ్య‌శాఖ‌..

క‌రోనా పూర్తిగా రూపుమాసిపోలేదు..ఎక్క‌డోచోట క‌రోనా కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి..కాగా కేంద్ర ఆరోగ్య‌శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ ని విడుద‌ల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,488 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,10,413 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,22,714 కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం 532 రోజుల అనంతరం ఇదే మొదటి సారి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.26 శాతంగా ఉంది. దేశంలో తాజాగా 313 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,65,662 కి చేరింది. దేశ వ్యా ప్తంగా రికవరీల సంఖ్య 3,39,22,037 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,16,50,55,210 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆరోగ్య శాఖ 63,16,49,378 కరోనా పరీక్షలు చేసింది .

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement