Wednesday, April 24, 2024

ఈడీ, సీబీఐల‌పై ‘కేజ్రీవాల్’ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఎన్నిక‌లు వ‌చ్చాయంటే చాలు కేంద్ర ఏజెన్సీలు ఈడీ, సీబీఐ యాక్టీవ్ గా మారతాయ‌ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో ఆప్ నాయ‌కులు స‌త్యేంద్ర‌జైన్ ను కూడా అరెస్ట్ చేస్తుంద‌నే స‌మాచారం త‌మ‌కి ఉంద‌న్నారు. కాగా ఆయ‌న‌పై ఇప్ప‌టికే రెండుసార్లు దాడులు చేసినా ఫ‌లితం శూన్య‌మ‌ని చెప్పారు. ఈ మేర‌కు ఈసారి కూడా వారికి స్వాగతం పలుకుతున్నామని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మేం పంజాబ్ సీఎం చన్నీలా ఏడవమని..చన్నీ తప్పుచేశానన్న నిరాశకు లోనయ్యాడని.. మేం ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడమని కేంద్రానికి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అన్ని ఏజెన్సీలను పంపగలదని సత్యేంద్ర జైన్ మాత్రమే కాదు వారు నాకు, మనీష్ సిసోడియా, భగవంత్ మాన్‌లపైన కూడా రైడ్స్ చేయగలరని.. వారిని చిరునవ్వుతో స్వాగతిస్తాం అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement