Saturday, April 20, 2024

తెలంగాణ ద‌యాదాక్షిణ్యాల‌పై కేంద్రం న‌డుస్తోంది – మంత్రి త‌ల‌సాని

తెలంగాణ‌కి ప్ర‌ధాని మోడీ ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. రోజుకు నాలుగైదు డ్రెస్సులు వేసుకుని ఫ్యాష‌న్ షో చేయ‌డ‌మే ఆయ‌న ప‌ని అని అన్నారు. మీ జీవితం ఎప్పుడూ.. హిందుస్తాన్, పాకిస్తానేనా.. అని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని త‌ల‌సాని వార్నింగ్ ఇచ్చారు. మూడేళ్లలో నిన్ను గెలిపించిన సికింద్రాబాద్ లో ఒక లక్ష రూపాయలు పని చేశారా..అని ప్రశ్నించారు. హైదరాబాద్ వరదలప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు చేశారని విమర్శించారు. మీ ఇంకో బీజేపీ ఎంపీ బండిపోతే .. బండి ఇస్తా అన్నాడు కానీ ఒక రూపాయి అయినా ఇచ్చారా.. అని విమర్శించారు. కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకువచ్చారు అని నిల‌దీశారు. మీ శక్తి ఎంత మా ముందట అని అన్నారు. మిమ్మల్ని ఎందుకు గెలిపించామని సికింద్రాబాద్ ప్రజలు అనుకుంటున్నారని తలసాని అన్నారు. గతంలో ఐటీఐఆర్ ని యూపీఏ గవర్నమెంట్ ఇస్తే… బీజేపీ రద్దు చేసిందన్నారు. తెలంగాణ దయాదాక్షిణ్యాలపైనే కేంద్రం నడుస్తున్న విషయాన్ని మరిచిపోవద్దని తలసాని అన్నారు. రైతాంగం నడ్డి విరిచింది బీజేపీ పార్టీ అని అన్నారు. అదానీ లాంటి ఇండస్ట్రియలిస్టులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. సర్జికల్ స్టైక్ లాంటివి బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement