Thursday, April 25, 2024

గిరిజనుల పట్ల కేంద్రం పక్షపాతం … స‌త్య‌వ‌తి రాథోడ్

గిరిజనుల పట్ల కేంద్రం పక్షపాతం చూపిస్తోందని రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఆరోపించారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణకు గిరిజన యునివర్సిటీ ప్రతిపాదన అందలేదని కేంద్ర మంత్రి ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. గిరిజన యూనివర్సిటీ విభజన చట్టంలోనే ఉందని, యూనివర్సిటీ ఏర్పాటుకు భూమి ఇచ్చామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు రూ.12 కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా కేంద్రం గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ కన్నా …తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు.
బీజేపీకి ప్రేమంతా ఎన్నికలు, అధికారంపైనే పేద ప్రజలపై లేదన్నారు. రేవంత్ రెడ్డి గొంతు పెంచి మాట్లాడితే అబద్ధం నిజం కాదన్నారు. రేవంత్ రెడ్డికి సోయిఉంటే, చేతనైతే కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. మేడారం జాతరకు బీఆర్ ఎస్ నాలుగేళ్ళ పాటు ఇచ్చిన నిధులు…కాంగ్రెస్ జీవితకాలంలో ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ను పాతాళం లోకి తొక్కడం కాదు..రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోకుండా చూసుకో అన్నారు. సమయం వచ్చినప్పుడు గిరిజన బంధు ఇస్తాం.. సీఎం కేసీఆర్ కు గిరిజనులంటే ఇష్టమ‌న్నారు. పోడు భూములు త్వరలోనే పంపిణీ చేస్తామ‌న్నారు.

కేంద్రం గిరిజనుల పట్ల అక్కసు కక్కడం మానుకోవడం లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ అబద్ధాలు ప్రకటించారన్నారు. గిరిజన యూనివర్సిటీ ప్రతిపాదన అందలేదని పార్లమెంట్ లో కేంద్రమంత్రి ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. గిరిజన యూనివర్సిటీ అనేది విభజన చట్టంలోనే ఉందన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం నోడల్ ఏజెన్సీగా సెంట్రల్ యూనివర్సిటీని నియమించిందన్నారు. 2017లోనే ములుగు జిల్లా దగ్గర 170 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. HRD ద్వారా కేంద్రానికి భూమి ఉందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. 2012, 22లో పార్లమెంట్ సెషన్స్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినప్పుడు కేంద్రం దగ్గరే ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్రం ప్రకటించిందన్నారు. తెలంగాణకు యూనివర్సిటీ రాకుండా బీజేపీ కక్షకట్టిందన్నారు. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి అసత్య ప్రకటన చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పార్లమెంట్ ను తప్పుదారి పట్టేలా సీనియర్ కేంద్రమంత్రి తప్పుడు ప్రకటన చేయడం ఏంటి ? అన్నారు. బీజేపీకి కేసీఆర్ పై కోపమా ? తెలంగాణ ప్రజలపై కోపమా ? అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి జాతీయస్థాయిలో ఏమైనా పోటీ వస్తదని అబద్ధపు ప్రకటన చేశారా? అన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గిరిజన యూనివర్సిటీ పై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు. ఈ స‌మావేశంలో విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, హరిప్రియ నాయక్ లున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement