Saturday, April 20, 2024

సీఎం జగన్ కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్‌కు ఊరట లభించింది. జగన్‌ బెయిల్‌ రద్దు చెయ్యాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. రఘురామ దాఖలుచేసిన పిటిషన్‌పై జూలైలో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును అప్పటి నుంచి కోర్టు రిజర్వు చేసింది. తాజాగా బుధవారం తీర్పు వెల్లడించింది.

అక్రమాస్తుల కేసులో భాగంగా ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలతో, కోర్టుకు గైహాజరవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు… పిటిషన్ను కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement