Thursday, March 28, 2024

పిల్లి కోసం తల్లి తపన ఆచూకీ చెప్పినవారికి 30 వేల బహుమతి

మనుష్యులు తప్పిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం చూశాం..పెంచుకున్న కుక్కలు మాయమయ్యాని కేసులను చూశాం, కాని ఇంట్లో పెంచుకునే పిల్లి మాయమైందని ఓ విచిత్రమైన కేసు టోలిచౌకిలో నమోదైంది. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. తాము గారభంగా పెంచుకున్న పిల్లి తప్పిపోయిందంటూ ఓ జంతు ప్రేమికురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో, తను పెంచుకున్న పిల్లి ఆచూకీ కోసం ఏకంగా 30 వేల రివార్డు ప్రకటించింది.

టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా స్వతహాగా జంతు పేమికురాలు. చిన్నతనం నుండి ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతుంది. గత ఎనిమిది నెలల క్రితం అప్పుడే పుట్టిన జింజర్ అనే పిల్లిని అడప్ట్ చేసుకుంది. అప్పటి నుండి జింజర్ ను ప్రేమగా పెంచుకుంది. కరోనా నేపథ్యంలో పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేందుకు జూబ్లీహిల్స్ లోని (ట్రస్టీ ) పెట్ క్లినిక్ కు జూన్ 17 న సర్జరీ చేయించింది. స్టిచెస్ వేసిన చోట స్వేల్లింగ్ రావడంతో తిరిగి జూన్ 23న అదే హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ట్రీట్మెంట్ జరుగుతుండగా జూన్ 24న హాస్పిటల్ నుండి పిల్లి తప్పిపోయిందంటూ హాస్పిటల్ సిబ్బంది ఆమెకు సమాచారం ఇచ్చారు. దీనితో హాస్పిటల్ వాళ్ళను నిలదీయడంతో వారి నుండి నిర్లక్ష్యంగా సమాధానం వచ్చిందని తెలిపారు.

తన పెంపుడు పిల్లి కనిపించడం లేదంటూ జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో , తానే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పంప్లెంట్స్ పంచుతూ తిరిగిన ఉపయోగం లేదంటూ కన్నీరు పెట్టుకుంది. దీనితో హైదర్ గూడ లో ఏర్పటు చేసిన సమావేశంలో తన బాధను మీడియా తో పంచుకుంది. తన పిల్లి ఆచూకీ కోసం గత 20 రోజులుగా వెతుకుతున్న లాభం లేకపోవడంతో … పిల్లి ఆచూకీ తెలిపిన వారికి ముప్పై వేల రివార్డును ప్రకటించింది.

ఇది కూడా చదవండి: ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో మార్పులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement