Monday, April 15, 2024

ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఢీకొన్న కారు – ఒక‌రు మృతి – మ‌రొక‌రి గాయాలు

ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను కారు ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా..మ‌రొక‌రికి గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న ఢిల్లీ
కళ్యాణ్‌పురి ప్రాంతంలో లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ సమీపంలో చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. మృతుడుని రాహుల్‌గా గుర్తించారు, అతని వయస్సు 36 సంవత్సరాలు. ఈ కేసులో నిందితుడు డ్రైవర్ అశ్వినిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నివాసముంటున్న అశ్విని వయసు 21 ఏళ్లు. పోలీసులు సెక్షన్ 304A/279/337 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అశ్విని తన సోదరుడితో కలిసి ఇందిరాపురంలో నివాసముంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మెడికల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. అప్పుడే తదుపరి చర్యలు తీసుకుంటామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement