Saturday, April 20, 2024

కెప్టెన్ రోహిత్ శర్మ కుడిచేతికి గాయం..

టీమిండియాకు ఇది షాకింగ్ న్యూస్. ఇంగ్లండ్ తో సెమీస్ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డారు. ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కుడి చేతికి గాయమైంది. అడిలైడ్‌ గ్రౌండ్‌లో నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. హిట్‌మ్యాన్‌ కుడి చేతికి గాయమైంది. దీంతో అతను విలవిల్లాడుతూ పక్కకు వెళ్లిపోయాడు. గురువారం టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ గాయం తీవ్రతపై బీసీసీఐ ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement