Friday, April 26, 2024

‘డబ్బులు పంచండి.. ఓట్లు కొనండి’

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘డబ్బులు పంచండి, ఓట్లు కొనండి’ అని నేతలకు సూచించారాయన. భయం లేకుండా డబ్బులు పంపిణీ చేయాలని చెప్పారు. ఓటర్లను ఏ,బీ,సీ గా విభజించాలని, ఓట్లు వేయనివారిని గుర్తించి, వారికి డబ్బులు ఇవ్వాలని ఎమ్మెల్యే అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేశారు. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా వైరా పట్టభద్రుల సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఓటర్లకు డబ్బులు పంచి ఓట్లను కొనాలని బహిరంగంగానే నాయకులకు సూచించారు. తమకు భయమేమీ లేదని, ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నా అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement