Wednesday, April 24, 2024

భారీ ట్ర‌క్ ని ఢీ కొన్న బ‌స్సు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం.. 15మందికి తీవ్ర గాయాలు

భారీ ట్ర‌క్ ని బ‌స్సు ఢీ కొంది.ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మ‌ర‌ణించారు.ఈ ప్ర‌మాదం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌హ్రాయిచ్ లో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మంచు తీవ్రంగా కమ్ముకోవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement