Thursday, April 18, 2024

బ‌స్సు బోల్తా.. ఇద్ద‌రు మృతి.. 30మందికి గాయాలు

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ బ‌స్సు బోల్తా ప‌డింది.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌ మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని ముంబైకి 480 కిలో మీటర్ల దూరంలో ఉన్న కంకవ్లీలోని గాడ్ నది వంతెన సమీపంలోని ఓ మలుపు వద్ద డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదానికి గురైన లగ్జరీ బస్సు 36 మంది ప్రయాణికులతో పూణె నుంచి గోవా వెళ్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కంకవ్లిలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement