Thursday, April 25, 2024

కాలువ‌లో ప‌డిన బ‌స్సు.. చెలరేగిన మంటలు.. 39మంది మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ బ‌స్సు అదుపుత‌ప్పి కాలువ‌లో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 39మంది ప్రాణాలు కోల్పొయారు. ప్రమాద సమయంలో బస్సులో సిబ్బంది సహా 48 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాలువలో పడడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చాలామంది ప్రయాణికులు సజీవదహనమయ్యారని చెప్పారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని వివరించారు. పాకిస్థాన్ బ‌లూచిస్థాన్ క్వెట్టా నుంచి కరాచీ వెళుతుండగా బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. మూలమలుపులో ఉన్న బ్రిడ్జి వద్ద బస్సు అదుపుతప్పిందని, రెయిలింగ్ ను ఢీకొని కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. గాయాలపాలైన వారిలోనూ కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement