Thursday, April 25, 2024

బ‌స్సు.. కారు ఢీ.. 30మంది దుర్మ‌ర‌ణం.. 15మందికి తీవ్ర‌గాయాలు

బ‌స్సు.. కారు ఢీ కొని లోయ‌లో ప‌డిపోయాయి. దాంతో 30మంది ప్ర‌యాణికులు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 15మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న పాకిస్థాన్ కార‌కోరం హైవేపై చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆసుప‌త్రికి తరలించారు.బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ సంతాపం తెలిపారు. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement