Thursday, April 25, 2024

Breaking : ఆర్థిక ఇబ్బందులతో – తమిళనాడు వాసి మృతి

బెలుగుప్ప : రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిండు గర్భిణి అయిన భార్యను.. రెండు సంవత్సరాల కూతురిని వ‌దిలి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సంఘటన బెలుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు ..తమిళనాడు రాష్ట్రం తిరువూరు జిల్లాకు చెందిన ధనరాజ్ గత ఏడు సంవత్సరాల క్రితం భార్య కీర్తనతో కలిసి వచ్చి.. మండల కేంద్రంలో ఓ బట్టలు పెట్టుకొని జీవనం సాగించేవాడు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ వ్యాపారాన్ని చేపట్టిన అతను సక్రమంగా వ్యాపారం జరగక.. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం ఎక్కువ కావడంతో తాను ఉంటున్న బాడిగ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం సొంత రాష్ట్రమైన తమిళనాడు కు వెళ్లి నిండు గర్భిణి అయిన బార్య కీర్తన ను మరియు రెండు సంవత్సరాల కూతుర్ని అక్కడే వదిలి శుక్రవారం ఉదయం మండల కేంద్రానికి చేరుకున్నాడు. బెలుగుప్ప కి వచ్చిన తర్వాత ఇంట్లో సామాన్లు ..కడిగి బట్టలు ఉతికి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ఉరి వేసుకున్నట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ ఎస్ఐ ఋషేంద్ర బాబు మాట్లాడుతూ.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement