Friday, April 26, 2024

Breaking : పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు మ‌ధ్యాహ్నానికి వాయిదా .. స‌హ‌క‌రించాల‌న్న ప్ర‌ధాని మోడీ ..

ఎంపీ ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతికి సంతాపం తెలుపుతూ రాజ్య‌స‌భ చైర్మ‌న్ స‌భ‌ను గంట‌సేపు వాయిదా వేశారు.. కాగా పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌యి వాయిదా కూడా ప‌డ్డాయి.. ప‌లు అంశాల‌పై చ‌ర్చించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు.. దాంతో లోక్ స‌భ స్పీక‌ర్ స‌భ‌ని మ‌ధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ మీడియాతో మాట్లాడారు. . ఉభయ సభలు ఆటంకాలు లేకుండా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ సమావేశాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధ‌మ‌న్నారు. ఆయా అంశాల‌పై పార్లమెంటులో చర్చించి, అన్ని ప్రక్రియలు సజావుగా కొనసాగేలా చూడాలని కోరారు. క‌రోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement