Thursday, March 28, 2024

Breaking : విశాఖ నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ కి గంజాయి..ముగ్గురి అరెస్ట్..

పోలీసులు ఎంత‌గా హెచ్చ‌రిస్తున్నా గంజాయి స్మ‌గ్లింగ్ మాత్రం జ‌రుగుతూనే ఉంది..కాగా రీసెంట్ గా విశాఖ నుంచి
మ‌ధ్య‌ప్ర‌దేశ్ కి గంజాయి స్మ‌గ్లింగ్ అవుతోన్న వైనం బ‌య‌టికి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మధ్యప్రదేశ్ లోని
బెండీలో కేసు నమోదు అయింది. దాంతో మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆన్ లైన్ స్టోర్ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కరివేపాకు పొడి, హెర్బల్ ప్రొడక్ట్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement