Thursday, April 25, 2024

Breaking : ప్ర‌భుత్వ డెంట‌ల్ కాలేజ్ లో లైంగిక వేధింపులు

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ డెంట‌ల్ కాలేజీలో లైంగిక వేధింపుల క‌ల క‌లం రేగింది. ఈ మేర‌కు ఇద్ద‌రు అసోపియేట్ ప్రొఫెస‌ర్ల‌పై విద్యార్ధినులు ఫిర్యాదు ఇచ్చారు. గ‌తంలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చినా మార‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ వేధింపులు మొద‌లుపెట్టారు. ఎనిమిది మంది స‌భ్యుల‌తో కూడిన క‌మిటీ విచార‌ణ చేప‌ట్టింది. ఎలాంటి వేధింపుల‌కు పాల్ప‌డ‌లేద‌ని అసోసియేట్ ప్రొఫెస‌ర్ ర‌మేష్ తెలిపారు. రిట‌న్ కంప్ల‌యింట్ రావ‌డంతో క‌మిటీతో విచార‌ణ , ప్రిన్సిపాల్ కావాల‌నే త‌న‌పై ఫిర్యాదు చేయించార‌ని ర‌మేష్ చెప్పారు. విచార‌ణ చేప‌ట్టి నిజాలు తేలుస్తామ‌ని వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement