Thursday, March 28, 2024

Breaking : శ్రీవారి ద‌ర్శ‌నానికి బ్రేక్ .. వారం రోజుల పాటు ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాని విజ్ఞ‌ప్తి..

గ‌త 20ఏళ్ళ‌లో ఎన్న‌డూ లేని విధంగా తిరుమ‌ల‌లో వ‌ర్షాలు కురిశాయి. దాంతో కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.. దాంతో నాలుగు ప్రాంతాల‌లో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యాయ‌ని టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొండ చ‌రియ‌లు విరిగిప‌డే ప్రాంతాల‌ను గుర్తించేందుకు ఢిల్లీ నుండి ఐఐటి నిపుణుల‌ను ర‌ప్పిస్తున్నామ‌న్నారు. ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకూండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలాగే రెండో ఘాట్ రోడ్డులో మరమత్తు పనులుకు సమయం పట్టే అవకాశం వుందన్నారు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే వాహన రాకపోకలుకు అనుమతిస్తామని చెప్పారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని వారం రోజులు పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూన్నామని… టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దర్శన టిక్కెట్లు రీ షేడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement