Saturday, April 20, 2024

Breaking : తెలంగాణ‌లో 31నుంచి తెరుచుకోనున్న పాఠ‌శాల‌లు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఉథృతి నేప‌థ్యంలో తెలంగాణ‌లో పాఠ‌శాల‌లు మూత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాగా క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖంప‌డుతోన్న నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌ను తెర‌వ‌నున్నారు. దాంతో తెలంగాణ‌లో ఈ నెల 31నుంచి పాఠ‌శాల‌లు తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు రేప‌టితో సెల‌వులు ముగియ‌నున్నాయి. ఎల్లుండి నుంచి స్కూల్స్ తెరుచుకోనున్నాయి. వైద్య ఆరోగ్య‌శాఖ సూచ‌న‌ల‌తో స్కూల్స్ తెర‌వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ల‌ను ధ‌రించాల‌ని వెల్ల‌డించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement