Saturday, April 20, 2024

Breaking : స్వాతి కాలేజ్ లో క్వ‌శ్చ‌న్ పేప‌ర్ లీక్ – పోలీసుల అదుపులో కాలేజ్ ఏవో కృష్ణ‌మూర్తి

పాలిటెక్నిక్ పేప‌ర్ లీకేజ్ కేసులో పురోగ‌తి క‌నిపించింది. పాలిటెక్నిక్ పేప‌ర్ లీకేజ్ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్వాతి కాలేజ్ లో పేప‌ర్ లీకైన‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించిన సంగ‌తి తెలిసిందే. ఈ లీకేజ్ పై ఆప‌రేష‌న్ జ‌రుగుతోంది. క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ల‌ను ఓపెన్ చేసిందెవ‌రు..వాటిని ఫొటోలు తీసిందెవ‌రు..విద్యార్థుల‌కు వాట్సాప్ లో షేర్ చేసింది ఎవ‌రు…ఇంత జ‌రుగుతుంటే అబ్జ‌ర్వ‌ర్ ఏం చేస్తున్నాడనే దిశ‌గా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌లో అబ్జ‌ర్వ‌ర్ పాత్ర ఏంటి అని ఆరా తీస్తున్నారు. కాగా పోలీసుల అదుపులో ఉన్నారు స్వాతి కాలేజ్ ఏవో కృష్ణ‌మూర్తి. కాగా ప‌రారీలోనే ఉన్నారు నిందితులు వెంక‌టేశ్వ‌ర్లు, కృష్ణ‌మోహ‌న్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement