Friday, March 29, 2024

Breaking : ప్ర‌ముఖుల‌కు కుచ్చుటోపీ..శిల్ప‌తో పాటు ఆమె భ‌ర్త అరెస్ట్..

శిల్ప అనే మ‌హిళ హైద‌రాబాద్ లో ప్ర‌ముఖుల్ని మోసం చేసింది. ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ప్ర‌ముఖులు,వ్యాపార వేత్త‌లు,ఫైనాన్షియ‌ర్స్ నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసింది. శిల్ప బాధితుల్లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు వున్నారు. పేజ్ త్రీ పార్టీల‌తో సెల‌బ్రిటీల‌ను ఆక‌ర్షించింది శిల్ప . రూ.100కోట్ల నుంచి రూ.200కోట్ల వ‌ర‌కు కుచ్చుటోపీ పెట్టింది. దాంతో పోలీస్ స్టేష‌న్ ల‌కు శిల్ప బాధితులు క్యూ క‌డుతున్నారు. అధిక వ‌డ్డీ ఇస్తాన‌ని చెప్పి రూ.కోట్లు వ‌సూలు చేసింది శిల్ప‌. కాగా శిల్పతో పాటు ఆమె భ‌ర్త‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్త శిల్పను ఆమె భ‌ర్త‌ను సైబరాబాద్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement