Wednesday, April 17, 2024

Breaking : బీకేయూ నేత ‘రాకేష్ టికాయ‌త్’ – ప్ర‌భుత్వం ముందు ప‌లు డిమాండ్స్

భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయ‌త్ మరోసారి తన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. అవసరమైతే మరోసారి ఉద్యమించేందుకు కూడా సిద్ధమని హెచ్చరించారు. తాజాగా ఆయన తన డిమాండ్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలియజేశారు. గత ఏడాది ముగిసిన ఆందోళన సమయంలో టికాయ‌త్ పెద్ద రైతు నాయకుడిగా ఎదిగారు. నవంబర్ 2021లో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొహాలీలో టికైత్ సుమారు 50 రైతు సంఘాలు .. సామాజిక సంస్థలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల పోరాటం ముగిసిపోలేదని, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) విడిపోయిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తే తప్పేనని అన్నారు. మళ్లీ ఆందోళనకు సిద్ధమని సూచించారు. బీబీఎంబీలో పంజాబ్, హర్యానా సభ్యుల శాశ్వత ప్రాతినిధ్యాన్ని రద్దు చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు సిలబస్ పుస్తకాల్లో సిక్కు చరిత్రను వక్రీకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, లఖింపూర్ ఖేరీ హింస కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని, ఆశిష్ మిశ్రా ..అతని సహాయకులను శిక్షించాలని డిమాండ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement