Wednesday, April 24, 2024

Breaking : ఏపీ ప్ర‌భుత్వంపై కేంద్రం సీరియ‌స్ .. ర‌ఘురామ లేఖ‌పై నివేదిక పంపాల‌ని ఆదేశాలు ..

ఏపీ ప్ర‌భుత్వంపై కేంద్రం సీరియ‌స్ అయింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై స‌మాధాన‌మివ్వ‌ని ఏపీ ప్ర‌భుత్వం.. ఎంపీ లాడ్స్ నిధుల‌ను చ‌ర్చిల నిర్మాణం కోసం ఖ‌ర్చు చేయ‌డంపై వెంట‌నే నివేదిక పంపాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.. ఎంపీ నందిగం సురేష్ చ‌ర్చి నిర్మాణానికి రూ.40 ల‌క్ష‌ల‌కు పైగా నిధులు ఇచ్చిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. మీడియా క‌థ‌నాల‌తో ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు. దాంతో ర‌ఘురామ లేఖ‌పై నివేదిక అందించాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి రెండు నెల‌ల క్రితం లేఖ రాసిన కేంద్ర గ‌ణాంకాలు, ప్ర‌ణాళిక శాఖ స్పందించ‌క‌పోవ‌డంతో మ‌రో లేఖ రాశారు. దేశంలో ఇంత‌లా అప్పులు చేస్తున్న రాష్ట్రం ఏపీ త‌ప్ప మ‌రొక‌టి లేదు..కాగ్ సైతం అప్పుల‌పై త‌ల‌లు ప‌ట్టుకుని ఏపీని వ‌దిలేసే ప‌రిస్థితి వ‌చ్చిందన్నారు . ఆర్థిక విధ్వంసంపై ప్ర‌ధాని, ఆర్బీణ బ్యాంక్ ల‌కు లేఖ‌లు రాస్తాన‌ని ర‌ఘురామ తెలిపారు. కార్పొరేష‌న్ ద్వారా అప్పులు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను బ‌లిప‌శువులు చేయొద్ద‌న్నారు. ఎఫ్ ఆర్ బీఎం ప‌రిధి మేర‌కు మాత్ర‌మే అప్పులివ్వాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement