Friday, April 19, 2024

Breaking : డిసెంబర్ 5న ప్రధాని మోడీ సమావేశం.. చంద్రబాబునాయుడికి ఆహ్వానం

టిడిపి అధినేత చంద్రబాబునాయుడికి ప్రధాని మోడీనుండి ఆహ్వానం అందింది. డిసెంబర్ 5వ తేదీన ప్రధాని మోడీ అధ్యక్షతన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరగనుంది.డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందడం విశేషం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి స్వయంగా చంద్రబాబును ఆహ్వానించారు. తదుపరి జీ20 భాగస్వామ్య దేశాల సదస్సు భారత్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు గురించి పార్టీల అధ్యక్షుల సమావేశంలో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశం ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర తెలుసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement