Thursday, March 28, 2024

Breaking: ఎద్దులు.. బండి లేనోళ్లు.. వీళ్లా సాగు గురించి మాట్లాడేది..

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వ్య‌వ‌సాయం గురించి తెలుసా అని ప్ర‌శ్నించారు మంత్రి నిరంజ‌న్‌రెడ్డి. సంజ‌య్‌కి బండి లేదు.. కిష‌న్‌రెడ్డికి ఎద్దులు లేవు అని సెటైర్ వేశారు. సాగు గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తాము చేప‌డుతున్న అభివృద్ధి.. తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయని, కేంద్ర ప్ర‌భుత్వం అస్పష్ట విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప‌టికైనా కేంద్రం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రమే నష్టపోతుందని చెప్పారు నిరంజ‌న్‌రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement