Thursday, April 25, 2024

Breaking : నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్ క‌న్నుమూత – విషాదంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ వాణిజ్య మండ‌లి అధ్య‌క్షుడు నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్ అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 78సంవ‌త్స‌రాలు. కొన్ని రోజులుగా ఆయ‌న హైద‌రాబాద్‌లోని స్టార్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందారు. ప‌రిస్థితి విష‌మించి ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు చెప్పారు. నారంగ్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్ అధినేత అయిన‌ నారంగ్ ప్ర‌స్తుతం న‌టుడు నాగార్జునతో ఘోస్ట్ ..హీరో ధనుశ్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. గ‌తంలోనూ ప‌లు సినిమాలు నిర్మించారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గాను ఆయ‌న ప‌లు సేవలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement