Friday, March 29, 2024

Breaking : అసెంబ్లీలో క‌న్నీరు పెట్టిన ఎమ్మెల్యే ‘రోజా’

రెండో రోజు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మంత్రి గౌత‌మ్ రెడ్డి మృతిపై సంతాప‌తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు సీఎం జ‌గ‌న్..కాగా గౌత‌మ్ రెడ్డి లేని లోటు పూడ్చ‌లేనిద‌ని అన్నారు జ‌గ‌న్.. గౌతమ్‌రెడ్డి గురించి ఇలా మాట్లాడాల్సి రావడం ఎంతో దురదృష్టకరం.. ఆయన ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని ఎమ్మెల్యే రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. జగనన్న క్యాబినెట్‌లో గౌతమ్ అన్న మంత్రిగా ఉన్న ఈ సమయంలో రెండేళ్లపాటు, నేను ఏపీఐఐసి ఛైర్‌పర్సన్‌గా ఉన్నాను. నన్ను ఎప్పుడూ ఒక చెల్లిగా చూసేవారు. న‌న్ను ఎప్పటికప్పుడు గైడ్‌ చేసే వారు. ఆయన ఒక బాహుబలి. అలాంటి వ్యక్తి క్షణాల్లో మాయమయ్యారు. ఆయన లేర‌న్న విషయం ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. ఫిట్‌నెస్‌ విషయంలో కానీ, సమస్యను ఎదుర్కోవడంలో కానీ ఆయన ఎప్పుడూ జగనన్నను ఆదర్శంగా తీసుకున్నారు. గౌతమ్ అన్న ఒక మంత్రిగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సక్సెస్‌ పర్సన్ అని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు రోజా.

Advertisement

తాజా వార్తలు

Advertisement