Tuesday, April 23, 2024

Breaking : సీఎం భ‌రోసా – సామాన్యుడికి వినోదాన్ని అందించాల‌నేదే జ‌గ‌న్ ఆలోచ‌న‌ – చిరంజీవి

సినిమా టిక్కెట్ల వివాదం ఓ కొలిక్కి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ మేర‌కు మెగాస్టార్ చిరంజీవి నేడు ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లో మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. వ‌న్ టు వ‌న్ సీఎం జ‌గ‌న్ తో మాట్లాడామ‌ని చెప్పారు. సినీ ఇండ‌స్ట్రీలో స‌మ‌స్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ కి వివ‌రించామ‌ని చెప్పారు. సీఎంతో స‌మావేశం సంతృప్తిక‌రంగా జ‌రిగింద‌న్నారు. మీటింగ్ చాలా బాగా జ‌రిగింద‌న్నారు చిరంజీవి. కొన్ని నెల‌లు అగ‌మ్య‌గోచ‌ర ప‌రిస్థితి నెల‌కొని ఉంద‌న్నారు. ఇండ‌స్ట్రీ వైపు నుంచి అసంతృప్తి ఉంద‌న్నారు. ఏదో చేయాల‌న్న ఆలోచ‌న ప్ర‌భుత్వం వైపు నుంచి ఉంద‌న్నారు.ఈ స‌మ‌యంలో త‌న‌ని ప్ర‌భుత్వం పిలిచింద‌ని తెలిపారు. సామాన్యుడికి వినోదాన్ని అందించాల‌న్న సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నానికి అభినంద‌లు తెలిపారు చిరంజీవి. ఎంతో భ‌రోసా ఇచ్చి సీఎం జ‌గ‌న్ మాట్లాడార‌ని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement