Wednesday, April 24, 2024

Breaking :మ‌ద్రాసు హైకోర్టు కీల‌క తీర్పు..జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లికే వేద నిల‌యం..

త‌మిళ‌నాడు మ‌ద్రాసు హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నివాసం వేద నిల‌యాన్ని మెమోరియ‌ల్ గా మార్చ‌డానికి వీలులేద‌ని కోర్టు తెలిపింది. ఈ మేర‌కు ఏడీఎంకే ఇచ్చిన జీవోను కోర్టు ర‌ద్దు చేసింది. ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవ‌డానికి హ‌క్కులేద‌ని తెలిపింది కోర్టు. మూడు వారాల్లో వేద నిల‌యాన్ని జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లుకు అప్ప‌జెప్పాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జయకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. ఈ నేప‌థ్యంలో కోర్టు తీర్పు కీల‌కంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement