Saturday, April 20, 2024

Breaking: బంక్ లో అక్రమాలు.. మూడున్న‌ర లీట‌ర్లు పోయిస్తే.. వ‌చ్చిందెంతో తెలుసా!

పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని చిట్టెంపల్లి స్టేజి వద్ద హైదరాబాద్ బిజాపూర్ హైవే పై ఉన్న కనకదుర్గ పెట్రోల్ పంప్ లో అవ‌క‌త‌వ‌క‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఆదివారం అంతరం గ్రామానికి చెందిన పాండు తన ద్విచక్ర వాహనం లో 310 రూపాయల పెట్రోల్ పోయించుకున్నాడు. అందులో లో ఒక లీటరున్న‌ర మాత్ర‌మే వచ్చిందని గుర్తించి బంక్ లో ఉన్న వర్కర్లను నిల‌దీశాడు. దీంతో అక్క‌డి సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెప్ప‌డంతో అనుమానం వ‌చ్చింది. దీంతో పెట్రోల్ ట్యాంక్ ఖాళీ చేసి చూడగా అందులో పెట్రోల్ చాలా త‌క్కువ వ‌చ్చింద‌ని బాధితుడు తెలిపాడు. గతంలో కూడా ఈ పెట్రోల్ బంకులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి సివిల్ సప్లయీస్‌ అధికారులు తనిఖీలు చేయ‌క‌పోవ‌డం, రెవెన్యూ అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే దీనికి కారణమని కొంతమంది అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పెట్రోల్ బంకుల పై నిఘా ఉంచాలని, పెట్రోల్.. డీజిల్ వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement