Thursday, April 18, 2024

Breaking : ప‌లు ఎంట్ర‌న్స్ టెస్టులకి తేదీలు ప్ర‌క‌టించిన – ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి

ప‌లు కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే ఎంట్ర‌న్స్ టెస్టులు వివ‌రాల‌ను ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి నేడు ప్ర‌క‌టించింది. జులై 4 నుంచి జులై 12 వరకు ఈఏపీసెట్ నిర్వహించనున్నారు. జులై 13న ఎడ్ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్ జరుపనున్నారు. జులై 18 నుంచి జులై 21 వరకు పీజీ ఈసెట్ నిర్వహిస్తారు. జులై 22న ఈసెట్, జులై 25న ఐసెట్ ఉంటాయి. కాగా, ఈఏపీసెట్ కు సంబంధించి… జులై 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలు, జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement