Wednesday, April 24, 2024

Breaking : అరాచ‌కాలు వ‌ద్దు..ఆడ‌వారిని గౌర‌వించండి..ఎన్టీఆర్..

ఏపీ అసెంబ్లీ ప‌రిణామాల‌పై హీరో,నంద‌మూరి కుటుంబ స‌భ్యుడు ఎన్టీఆర్ స్పందించారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు,ప్ర‌తివిమ‌ర్శ‌లు స‌హ‌జం అని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అన్నారు. విమ‌ర్శ‌లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌ర‌గాల‌ని తెలిపారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు మాని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌న్నారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు అరాచ‌క‌పాల‌న‌కు నాంది అని అన్నారు. మ‌హిళ‌ల‌ను ప‌రుష ప‌ద‌జాలంతో దూషించ‌డం మ‌న సంస్కృతి కాద‌ని చెప్పారు. ఆడ‌వాళ్ల‌ను గౌర‌వించ‌డం మ‌న సంప్ర‌దాయ‌మ‌ని తెలిపారు. నిన్న అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై పై విధంగా స్పందించారు.ఈ వివాదం ఇక్క‌డితో ఆగిపోతుంద‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాన‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement