Friday, April 19, 2024

Breaking : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తా..బాధితుల‌ను ఆదుకోండి..చంద్ర‌బాబు నాయుడు..

త్వ‌ర‌లోనే వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.. టిడిపి నేత‌ల‌కు ఆ పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు..ఈ మేర‌కు ఆయ‌న పార్టీ నేత‌ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. వరద బాధితులకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలన్నారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని … పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోందన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందు ఉంటుందని.. వరద బాధిత ప్రజలకు ప్రభుత్వం కంటే ముందే సేవలు అందించేందుకు రంగంలోకి దిగిందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టుతో సమన్వయం చేసుకుని టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement