స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ ఎస్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 12మంది అభ్యర్థులను ఎంపిక చేయగా వీరంతా 23వ తేదీన నామినేషన్ వేయాలని అధిష్ఠానం నుండి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
కాగా, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.
కరీంనగర్ – భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ,
రంగారెడ్డి- శాంబిపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి,
మహాబుబ్ నగర్ – కసిరెడ్డి నారాయణ రెడ్డి, సాయి చంద్ (గాయకులు)
వరంగల్ – పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,
ఆదిలాబాద్ – దండే విఠల్
నల్లగొండ – MC కోటిరెడ్డి
నిజామాబాద్ – ఆకుల లలిత
ఖమ్మం – తాత మధు,
మెదక్ – డా.యాదవరెడ్డి
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..