Thursday, April 18, 2024

Breaking : పాలిటెక్నిక్ కాలేజీలో పేలిన గ్యాస్ సిలిండ‌ర్ – 13 మంది సజీవదహనం

ప్ర‌మాద‌వ‌శాత్తు పాలిటెక్నిక్ కాలేజీలో గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో 13మంది స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన విద్యార్థులందరినీ అలీఘర్ హయ్యర్ మెడికల్ సెంటర్‌లో చేర్చారని, గాయపడిన వారందరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం.. వంట చేస్తుండగా వంటగదిలో 5 కిలోల గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. బులంద్‌షహర్‌లోని దిబాయి తహసీల్ వెనుక ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ లో జ‌రిగింది. పేలుడు శబ్దం విని, కళాశాల క్యాంపస్‌తో పాటు సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement