Thursday, April 25, 2024

Breaking : గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎన్నికల కమిషన్

వచ్చే నెల గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వమించనున్నారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ని రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్. తొలి విడత పోలింగ్ కోసం ఈ నెల 5న, రెండో విడత కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో.. డిసెంబర్ 1, 5 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 51 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం గుజరాత్ లో 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 4.61 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారని మీడియా సమావేశంలో సీఈసీ రాజ్ కుమార్ చెప్పారు. అంతకుముందు, మోర్బీ వంతెన మృతులకు అధికారులు సంతాపం వ్యక్తంచేశారు. ఈసారి జరగనున్నఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు. ఓట్ల లెక్కింపును డిసెంబర్ 8న చేపడతామని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా వచ్చే నెలలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. డిసెంబర్ 10వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement