Wednesday, April 24, 2024

Breaking : డ్ర‌గ్స్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు – ముగ్గురి అరెస్ట్

హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ ని ప‌ట్టుకున్నారు. 183గ్రాముల కొకైన్,44ఎండీ ట్యాబ్ లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్ర‌గ్స్ విలువ రూ.28ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా. ఈ మేర‌కు సైబ‌రాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. న్యూ ఇయ‌ర్ కోసం డ్రగ్స్ ని తెచ్చిన‌ట్టు పోలీసులు అనుమానించారు. గోవా నుంచి ఈ డ్ర‌గ్స్ ని తీసుకువ‌చ్చిన‌ట్టు తెలిపారు. దావుద్ అనే వ్య‌క్తి అరెస్ట్ చేశారు. డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా డ్ర‌గ్స్ డీల‌ర్లు మాత్రం పోలీసుల క‌ళ్ళు గ‌ప్పి అమ్మ‌కాలు జ‌రుపుతున్నార‌ని పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement