Thursday, April 25, 2024

Breaking : ఢీ షోకి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్..త‌గ్గేదే లే అంటోన్న డ్యాన్స‌ర్స్..

డ్యాన్స్ కి పెట్టింది పేరు ఢీ షో..బుల్లితెర‌పై దూసుకుపోతోన్న షోల‌లో ఇది కూడా ఒక‌ట‌నే చెప్పాలి..ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్ చేస్తోన్న ఈ షోలో సుధీర్ ,ర‌ష్మీ,ప్రియ‌మ‌ణి,పూర్ణ త‌దిత‌రులు సంద‌డి చేస్తుంటారు. ఈ షో ఫైన‌ల్స్ కి ప‌లువురు సెల‌బ్రిటీలు విచ్చేస్తుంటారు..ఢీ12కి ఎన్టీఆర్ గెస్ట్ గా వ‌చ్చారు. కాగా ఢీ13షోలో ఫైన‌ల్స్ కు ఈసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నార‌ని ప్రోమో రిలీజ్ చేశారు. ఈ డ్యాన్స్ షోకి డ్యాన్స్ అద‌ర‌గొట్టే బ‌న్నీ చీఫ్ గెస్ట్ అని తెలిసి ఫ్యాన్స్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. కాగా సెమీ ఫైన‌ల్స్ లో కింగ్స్ వ‌ర్సెస్ క్వీన్ టీం నుండి న‌లుగురు స‌భ్యులు ఎంపిక కానున్నారు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య పోటీ జ‌రుగుతుంది. ఈ పోటీలో గెలిచిన వారికి ఢీ టైటిల్ షీల్డ్ ని అంద‌జేస్తారు. మ‌రి ఈ సారి బ‌న్నీ చేతుల‌మీదుగా ఈ అవార్డ్ ని ఎవ‌రు అందుకోనున్నారో చూడాలి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement