Friday, April 19, 2024

Breaking : కూలీకి దొరికిన వ‌జ్రం..త‌ర్వాత ఏం జ‌రిగింది..

అదృష్టం ఎప్పుడు ఎవ‌రిని ఏరూపంలో వ‌రిస్తుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు..ఇప్పుడ‌దే జ‌రిగింది. ఓ కూలీని ల‌క్ష‌ధికారిని చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే…గ‌నిలో ప‌ని చేసే ఓ కూలీకి వ‌జ్రం దొరికింది. ఇంకేముంది ఆ కూలీ కాస్తా ల‌క్షాధికారిగా మారిపోయాడు. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప‌న్నా జిల్లాలో చోటు చేసుకుంది. ప‌న్నాలోని హీరాపూర్ త‌ప‌రియ‌న్ ప్రాంతం గ‌నుల్లో ప‌ని చేసే శంశేర్ ఖాన్ ఈ వ‌జ్రం దొరికింది. ఈ వజ్రం ఆరు క్యారెట్ల 66సెంట్ల బ‌రువు ఉంది. ఈ వ‌జ్రం ధ‌ర 20ల‌క్ష‌లు ఉంటుంద‌ని స‌మాచారం. కాగా ఈ వ‌జ్రాన్ని వేలం వేసేందుకు ఆ కూలీ వ‌జ్రాన్ని ప్ర‌భుత్వ అధికారుల‌కు అప్ప‌జెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement