Thursday, April 25, 2024

Breaking: కిదాంబి శ్రీకాంత్​ సహా ఏడుగురు భారత ఆటగాళ్లకు కరోనా.. టోర్నీ నుంచి అవుట్​

ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ- 2022లో కొవిడ్-19 కలకలం రేపింది. భారత్​కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో వారు టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్​) తెలిపింది. కరోనాబారిన పడ్డవారిలో కిదాంబి శ్రీకాంత్​, అశ్విని పొన్నప్ప, రిథికా రాహుల్, థెరిసా జాలీ, మిథున్​ మంజునాథ్​, సిమ్రాన్ అమన్​ సింగ్​, కుషి గుప్తాలు ఉన్నారు.

“ఆటగాళ్లకు మంగళవారం నిర్వహించిన ఆర్​టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురికి పాజిటివ్​గా తేలింది. ఈ క్రమంలో ఏడుగురితో సన్నిహిత సంబంధాలున్న ఆటగాళ్లంద‌రినీ టోర్నీ నుంచి త‌ప్పించాం. కరోనా సోకిన ప్లేయర్స్​కు బదులు ఎవరినీ తీసుకోం. ప్రత్యర్థి ఆటగాళ్లను తదుపరి రౌండ్​కు పంపిస్తాం.” అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. గురువారం తెల్లవారుజామున బీడబ్ల్యూఎఫ్​ ఈ విషయాన్ని తెలిపింది. కానీ, కొవిడ్ సోకిన ప్లేయర్స్ లిస్ట్​ మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్, బ్యాడ్మింటన్​ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రోజూ ఆటగాళ్లకు కొవిడ్​-19 టెస్టులు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement