Tuesday, April 16, 2024

Breaking : డివైడ‌ర్ ని ఢీ కొట్టిన బ‌స్సు-15మందికి గాయాలు-ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

ప్రెవేట్ ట్రావెల్స్ బ‌స్సు ఎదురుగా వ‌స్తున్న లారీని త‌ప్పించే ప్ర‌య‌త్నంలో డివైడ‌ర్ ని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 15మంది గాయ‌ప‌డ్డారు.. కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విష‌మంగా ఉంది. ఈ సంఘ‌ట‌న ఎన్టీఆర్ జిల్లా కంచిక‌చ‌ర్ల వ‌ద్ద చోటు చేసుకుంది.
విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు స‌మాచారం. కాగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement