Thursday, April 25, 2024

Breaking : బ‌స్సు ప్ర‌మాదంలో తొమ్మిది మంది మృతి : ప‌లువురి ప‌రిస్థితి విష‌మం

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరువాగులో పడింది. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బ‌స్సుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణీకులు మృతిచెందగా, మ‌రికొంద‌రి పరిస్థితి విషమంగా ఉంది. బ‌స్సు వాగులో ప‌డిన స‌మ‌యంలో 47మంది ప్ర‌యాణీకులున్నారు. ఈ ప్ర‌మాదంలో బ‌స్సు డ్రైవ‌ర్ చిన్నారావు మృతి చెందాడు. మృతుల్లో ఐదుగురు మ‌హిళలు ఉన్నారు. మిగ‌తా ప్ర‌యాణీకుల‌ను ర‌క్షించేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.క్ష‌త‌గాత్రుల‌ను జంగ‌రెడ్డిగూడెం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement