Thursday, March 28, 2024

Breaking : ఏపీ పాలిటిక్స్ లో భీమ్లానాయ‌క్ దుమారం – బీజేపీ, జ‌న‌సేన‌,టీడీపీ బ్లాక్ టికెట్ల‌ను స‌మ‌ర్థిస్తున్నాయా – మంత్రి పేర్ని నాని

ఏపీ పాలిటిక్స్ లో భీమ్లానాయ‌క్ దుమారం రేగింది. సినిమాను కూడా రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నార‌ని మంత్రి పేర్ని నాని అన్నారు. సినిమా కోసం చంద్ర‌బాబు, లోకేష్ పిల్లి మొగ్గ‌లు వేస్తున్నార‌న్నార‌ను. హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాను తొక్కేయ‌డం ఏంటీ అని ప్ర‌శ్నించారు. రాజ‌కీయాల‌కోసం ప్ర‌తి వ్య‌వ‌స్థ‌ను తొక్కేసిన ఘ‌ట‌న చంద్ర‌బాబుదే అన్నారు. హైకోర్టు తీర్పు అంటే లెక్క‌లేదా అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ జీవోలు అంటే కూడా లెక్క‌లేదా..బ్లాక్ మార్కెటింగ్ ను కూడా స‌మ‌ర్థిస్తారా..ఇలాంటి దిక్కు మాలిన వ్య‌వ‌స్థ ఇక్క‌డే ఉంద‌న్నారు. బీజేపీ, జ‌న‌సేన‌,టీడీపీ బ్లాక్ టికెట్ల‌ను స‌మ‌ర్థిస్తున్నాయా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement