Thursday, April 18, 2024

Breaking : మంత్రి నిశిత్ ప్ర‌మాణిక్ కాన్వాయ్ పై దాడి.. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించిన పోలీసులు

బిజెపి ఆఫీసుకి వెళ్తుండ‌గా కేంద్ర స‌హాయ మంత్రి నిశిత్ ప్ర‌మాణిక్ కాన్వాయ్ పై దాడి జ‌రిగింది.అది కూడా ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌న్హారం.. ఈ సంఘ‌ట‌న‌తో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపైకి కర్రలు పట్టుకుని బీజేపీ కార్యకర్తలు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకోవడం వీడియోలో చూడొచ్చు.కాగా ఈ దాడిని తృణ‌ముల్ కాంగ్రెస్ కార్యకర్తలే చేశారని నిశిత్ ప్రమాణిక్ ఆరోపించారు. మంత్రికే రక్షణ లేదంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఊహించుకోండి. బెంగాల్ లో ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటో.. ఈ ఘటన ద్వారా తెలిసిపోయింద‌ని ఆయన విమర్శించారు. కూచ్ బెహర్ నుంచి ఎంపీగా ప్రమాణిక్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్).. కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుంది. ఇటీవల బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో గిరిజనుడు చనిపోవడంపై కేంద్ర మంత్రి ప్రమాణిక్‌పై ప్రజలు కోపంతో ఉన్నారని స్థానిక రిపోర్టులు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగిఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement