Friday, March 29, 2024

Breaking : విమానాల ర‌ద్దుపై మోడీకి లేఖ రాసిన కేజ్రీవాల్.. ఎందుకో తెలుసా ..

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఓ లేఖ రాశారు… కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఎక్కువగా ఉన్న దేశాల విమానాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆలస్యం అయితే మళ్లీ ప్రజలంతా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు.. యూరోపియన్ యూనియన్ దేశాలు ఓమిక్రాన్ ప్రభావిత దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయని లేఖలో కేజ్రీవాల్ తెలిపారు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా క‌ల‌క‌లం .. ఇప్పుడేమో ఓమిక్రాన్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ పేరు వింటే చాలు ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. కాగా ఓమిక్రాన్ వేరియంట్ తీవ్ర‌త ఉన్న దేశాల‌పై ట్రావెల్ బ్యాన్ ని విధిస్తున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చే వారిపై కరోనా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా కూడా ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ పై అలెర్ట్ అయింది. పలు రాష్ట్రాలు కూడా ఆంక్షలు కూడా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement