Monday, April 15, 2024

Breaking : క‌రోనా నుంచి కోలుకున్న గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్..

క‌రోనా నుంచి కోలుకున్నారు ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్..హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో విజ‌య‌వాడ చేరుకున్నారు బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్..తాజాగా ఆయనకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నెగెటివ్ గా తేలినట్లు తేలిందని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని ఏఐజీ ఆసుపత్రికి చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం విడుదల చేసిన నివేదికలో తెలిపారు.ఈ నెల 17న ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న బిశ్వభూషణ్‌ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆయన స్వల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడం వల్ల గవర్నర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించిన సంగ‌తి విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement